చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-29T23:40:37+05:30 IST

సస్పెండైన జడ్జిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘వైసీపీ నుంచి దళితులను దూరం

చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు: పెద్దిరెడ్డి

తాడేపల్లి: సస్పెండైన జడ్జిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘వైసీపీ నుంచి దళితులను దూరం చేయాలని బాబు కుట్రలు చేస్తున్నారు. మేము దాడులు చేస్తున్నామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. గతంలో నాపై కూడా  కేసులు పెట్టించారు. మాజీ జడ్జి రామకృష్ణ తమ్ముడు మార్కెట్ వద్ద కారు అడ్డుపెడితే అక్కడ గొడవ జరిగింది. పోలీసుల విచారణ అనంతరం ఆ దాడికి మాకు సంబంధం లేదని తెలిసింది. మా కుటుంబంపై కావాలనే విమర్శలు చేశారు. ఆఖరికి టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి దాడి చేశారు అని తెలిసింది. ఇప్పుడు దీనిపై చంద్రబాబు ఏమి మాట్లాడతారు? డీజీపీ సైతం దీనిపై చంద్రబాబుకు లేఖ రాశారు. టీడీపీ వాళ్లే కొట్లాడుకుని మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’ అని మంత్రి ఆరోపించారు.


విలేకరుల ప్రశ్నలకు..

వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ‘ఆ ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి నిజంగా వైసీపీ కార్యకర్త అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. సీసీ ఫుటేజ్ చూశాకే ప్రతాప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అని మంత్రి చెప్పారు. మామ పార్టీ లాక్కుని చంద్రబాబు నీతులు మాట్లాడుతున్నారు. ఒక్క మైనారిటీకి కూడా చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-09-29T23:40:37+05:30 IST