బీజేపీపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-28T16:59:27+05:30 IST

బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం

అమరావతి: బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ప్రజాగ్రహం తమపై ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా అని వ్యాఖ్యానించారు. బీజేపీకి పెట్రో ధరలపై మాట్లాడే దమ్ము ఉందా అని నిలదీశారు. మద్యం ధరలు పెరిగినందుకు కాదని.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినందుకు బీజేపీ నేతలు బాధపడాలన్నారు. ఎరువుల ధరల పెంపుపై బీజేపీకి బాధలేదా అని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలపై బీజేపీ స్పందించాలని మంత్రి పేర్నినాని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-28T16:59:27+05:30 IST