అమరావతి అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు: మంత్రి పేర్నినాని

ABN , First Publish Date - 2021-02-23T21:44:01+05:30 IST

అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు.

అమరావతి అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు: మంత్రి పేర్నినాని

అమరావతి: అమరావతి ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు. తమ డిమాండ్‌లు ఏమిటో చెప్పాలని కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని మంత్రి పేర్కొన్నారు. చర్చల కోసం మంత్రులు, ఎంపీలు వెళ్లినా ఇష్టానుసారం బూతులు తిట్టి పంపించారని ఆయన ఆరోపించారు. తమ బొమ్మలు పెట్టి ఇష్టానుసారం దూషించారని ఆయన విమర్శించారు. విశాఖలో పాలనా రాజధాని వస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. అది అందరూ చూసే రోజు వస్తుందని మంత్రి పేర్నినాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-02-23T21:44:01+05:30 IST