సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2021-03-19T16:40:28+05:30 IST
రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ సంస్థకు రూ.3 వేల కోట్లు కేటాయించిన సీఎం
ఖమ్మం: రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ సంస్థకు రూ.3 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్లో ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.150 కోట్లు కేటాయించారని మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ నెల 27న ఖమ్మం కొత్త బస్టాండ్ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐటీ హబ్ రెండో దశకు శంకుస్థాపన, సత్తుపల్లిలో మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారని అజయ్ తెలిపారు.
ఇల్లందు సర్కిల్ వద్ద గల ప్రస్తుత ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించారు. ఐటీ హబ్ మొదటి దశను 5 అంతస్థులను రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఐటీ హబ్ను 41,250 చదరపు అడుగుల్లో 430 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తించేలా నిర్మించారు. రెండో దశ ఐటీ హబ్ను అదే ప్రాంగణంలో 55 వేల చదరపు అడుగుల్లో 570 మంది ఉద్యోగులు ఒకేసారి విధులు నిర్వర్తించేలా నిర్మించనున్నారు. రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరపనున్నారు.