రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-05-25T09:46:50+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 మంత్రి ఈటల రాజేందర్‌


హుజూరాబాద్‌, మే 24: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌ పట్టణ శివారులోని కేసీ క్యాంపులో రూ. 25వేల లోపు రుణాలు ఉన్న 437 మంది రైతులకు 68.23 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ధాన్యగారంగా మారబోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, హుజూరాబాద్‌ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-25T09:46:50+05:30 IST