రెవెన్యూ సమస్యలపై మంత్రి ధర్మాన సమీక్ష
ABN , First Publish Date - 2021-04-17T00:34:47+05:30 IST
రెవెన్యూశాఖలో నెలకొన్న పెండింగ్ సమస్యలపై అధికారులతో మంత్రి ధర్మాన
అమరావతి: రెవెన్యూశాఖలో నెలకొన్న పెండింగ్ సమస్యలపై అధికారులతో మంత్రి ధర్మాన సమీక్ష నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతులపై అధికారులతో మంత్రి చర్చించారు. వివాదాలకు తావులేకుండా పదోన్నతులు ఇస్తామని అధికారులు తెలిపారు. భూ రీ సర్వే వివరాలను మంత్రి ధర్మానకు అధికారులు వివరించారు.