ఇంటర్ పరీక్షలపై అధికారులతో మంత్రి సబిత సమీక్ష

ABN , First Publish Date - 2021-10-21T18:03:30+05:30 IST

ఈ నెల25 నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలపై అన్ని శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇంటర్ పరీక్షలపై అధికారులతో మంత్రి సబిత సమీక్ష

హైదరాబాద్: ఈ నెల25 నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలపై అన్ని శాఖల అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 25 నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి తెలిపారు. గతంలో కరోనా కారణంగా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామన్నారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని అన్నారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచడం జరిగిందని మంత్రి చెప్పారు. 25 వేల మంది ఇన్విజిలేటర్‌లు పాల్గొంటున్నారని, పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు గంట ముందు వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్ష నిర్వహణకు సహకరించాలన్నారు. కాగా ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘాలపై మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల టైమ్‌లో ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనలు చేశారు. 

Updated Date - 2021-10-21T18:03:30+05:30 IST