అధికారులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2021-05-11T05:02:36+05:30 IST

అధికారులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

అధికారులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

 కొవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   

మంత్రి సత్యవతిరాథోడ్‌ 

మహబూబాబాద్‌ , మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా మహహ్మరీ నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, వైరస్‌బారిన పడ్డ వారికి చికిత్స అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఫీవర్‌ సర్వే ద్వారా గ్రామా ల్లో ఇంటింటికి వెళ్లి కరోనా నియంత్రణపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిత్యం కరో నాపై సమీక్షిస్తూ కట్టడికి చర్యలు తీసుకుం టున్నారని తెలిపారు. ఆక్సిజన్‌, మందుల, కరోనా టెస్ట్‌ కిట్ల కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే మరింత వైద్య సిబ్బందిని నియమించనున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-11T05:02:36+05:30 IST