గిరిజనుల రిజర్వేషన్లు బీజేపీ ఎందుకు పెంచలేదు: మంత్రి సత్యవతి
ABN , First Publish Date - 2022-01-21T00:25:36+05:30 IST
గిరిజనులపై బీజేపీకి ప్రేమ ఉంటే రిజర్వేషన్లను ఎందుకు
హైదరాబాద్: గిరిజనులపై బీజేపీకి ప్రేమ ఉంటే రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. గిరిజనులు, దళితులకు బీజేపీ అన్యాయం చేసిందని ఆమె ఆరోపించారు. అటవీ చట్టాలు ఎవరి పరిధిలో ఉంటాయో తెలుసుకోవాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు. బీజేపీ చేసే చట్టాలనే తాము అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని సత్యవతి తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ఎందుకు పెండింగ్లో పెట్టారని ఆమె నిలదీశారు. ములుగులో ట్రైబల్ వర్సిటీకి ఇంతవరకు అతీగతి లేదని బీజేపీపై మంత్రి మండిపడ్డారు.