తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట: మంత్రి Satyavati

ABN , First Publish Date - 2021-11-15T17:09:27+05:30 IST

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట: మంత్రి Satyavati

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  అనారోగ్యంతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా  నిలోఫర్ ఆసుపత్రిలో వార్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నగరం నలువైపులా సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున్న మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం కేసీఆర్ రూ.10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారని తెలిపారు. కోవిడ్‌లో వైద్యులు ప్రాణాలకు తెగించి పని చేశారని... ఇక ముందు కూడా అలాగే పని చేయాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నందుకు గిరిజన బిడ్డగా గర్వపడుతున్నానని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-15T17:09:27+05:30 IST