అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి మంత్రి Shankarnarayana
ABN , First Publish Date - 2021-11-15T16:56:30+05:30 IST
రాష్ట్ర మంత్రి శంకరనారాయణ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారు.
అనంతపురం: రాష్ట్ర మంత్రి శంకరనారాయణ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించారు. మంత్రి స్వయంగా తన అనుచరులను వెంటబెట్టుకుని మరీ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. జిల్లాలోని 15వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి అనుచరుల వాహనాలు ఆయన వెంటే కాన్వాయ్గా వెళ్తున్నాయి. అంతే కాకుండా 15వ వార్డు పోలింగ్ కేంద్రం ముందే అభ్యర్థులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్నారు. ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపిస్తారని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు.