ఆందోళన కలిగించే ప్రకటనలు చేయొద్దు
ABN , First Publish Date - 2020-08-04T10:19:57+05:30 IST
ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రకటనలు చేయడం మాను కో వాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 3 : ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రకటనలు చేయడం మాను కో వాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈమేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పదివేల మంది వైద్యులను నియమిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వానికి అప్పగిస్తే తగిన ధర చెల్లిస్తామన్నారు. కరోనా బాధితులకు చికిత్స ఇ వ్వాలనుకున్న ప్రైవేట్ వైద్యులకు ప్రభుత్వం పూర్తి ప్యాకేజీ, సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ మహిళా కార్యకర్తలు మం త్రికి రాఖీలను కట్టి తమ అభిమానాన్ని చా టుకున్నారు. కాగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఫి షరీస్ అసి స్టెంట్ పూర్తి స్థాయి డేటా ఎంట్రీ కోసం మత్స్యశాఖ తరఫున ట్యాబ్ లను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ శ్రీని వాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.