బాధిత మహిళలకు అండగా ఉండాలి : మంత్రి సురేష్
ABN , First Publish Date - 2020-06-05T10:20:57+05:30 IST
బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్స్టేషన్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని విద్యాశాఖ మంత్రి ..
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 4 : బాధిత మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్స్టేషన్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక సంతపేటలోని దిశా పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దిశా పోలీస్ స్టేషన్లోని అన్ని సౌకర్యాలను పరిశీలించి నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళలు పొందుతున్న న్యాయ సేవలు, కేసులలో పురోగతిపై ఆరా తీశారు. మహిళలకు అండగా దిశా పోలీస్స్టేషన్ ఉందనే భావన కల్పించే విధంగా పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఓఎస్డీ చౌడేశ్వరి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.