హుజూరాబాద్ కు తరలిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-08-16T20:15:49+05:30 IST

హుజూరాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో దళితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలుతరలి వెళ్లారు.

హుజూరాబాద్ కు తరలిన మంత్రి తలసాని

హైదరాబాద్: హుజూరాబాద్ లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో దళితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలుతరలి వెళ్లారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో భారీగా సంఖ్యలో దళితులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వచ్చారు. దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించే దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.దీంతో సనత్ నగర్ నియోజక వర్గం నుంచి కూడాభారీ సంఖ్యలో దళితులు, పార్టీ కార్యకర్తలను మంత్రి తలసాని తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు సామాజికంగా, ఆర్ధికంగా నిలదొక్కు కునేందుకు, ప్రభుత్వం ఇచ్చేసాయంతో వారు తమ కాళ్లపై తాము నిలబడేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. 

Updated Date - 2021-08-16T20:15:49+05:30 IST