గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతానికి కేసీఆర్ ప్రాధాన్యత: తలసాని

ABN , First Publish Date - 2021-09-13T19:47:41+05:30 IST

ల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సింగపూర్ లో గల ఊర చెరువులో, బేతిగల్ ఊర చెరువులో, జమ్మికుంటలోని గుండ్ల చెరువుల్లో

గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ బలోపేతానికి కేసీఆర్ ప్రాధాన్యత: తలసాని

కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సింగపూర్ లో గల ఊర చెరువులో, బేతిగల్ ఊర చెరువులో, జమ్మికుంటలోని గుండ్ల చెరువుల్లో సోమవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను విడుదల చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యే లు సతీష్ బాబు, పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, జిల్లా ఫిషరీస్ సోసైటీ మాజీ చైర్మన్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈటెల రాజీనామా చేసినందుకు చేపలు వస్తున్నాయా?తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వల్ల సామాన్యులు బాగుపడుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. 


తెలంగాణలోగ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నరు. ఆర్ధిక వ్యవస్ధ పురోగతికి సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు కుల వృత్తుల వారిని ఓటు బ్యాంకుగా చూశారుసీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళను బలోపేతం చేస్తున్నారుని అన్నారు. రూ. 115 కోట్లతో చేప పిల్లల ఇచ్చే స్థాయికి వస్తామని కలలో కూడా ఊహించలేదన్నారు. కరెంటు, నీళ్లు ఈ విధంగా వస్తాయని రైతులు ఊహించలేదని, 66 వేల మందికి టూ వీలర్, ఇతర వాహనాలు, పనిముట్లు ఇచ్చామని మంత్రి వివరించారు.ఇవన్నీ హుజురాబాద్ ఎన్నికల కోసం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. 


సీఎం కేసీఆర్ నీటిపై హక్కు మత్స్యకారులకే ఉండాలని జీవో ఇచ్చారు.మార్కెటింగ్ సౌకర్యాలు పెరగడానికి కూడా స్టడి చేస్తున్నాం.ఇక్కడి చేపలను ఎగుమతి చేసే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.కేసీఆర్ లాంటి సీఎం దేశంలో లేరని, 70 ఏళ్ల గోసను సీఎం కేసీఆర్ మన బతుకుల గురించి ఆలోచించి బాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న బిజెపీ నేతలు ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా? మతాలను అడ్డుపెట్టుకుని బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మంత్రి తలసాని మండిపడ్డారు. ఈటెల రాజేందర్ గెలిస్తే ఏం ప్రయోజనం జరుగుతదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ద్వారా ఏదైనా మంచి ప్రాజెక్టు తీసుకువచ్చి ఇక్కడి నేతలు మాట్లాడాలి.తిట్టడం పెద్ద పని కాదు.. పనులు చేయాలని ప్రజలు గెలిపించారని బండి సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు. రెండేళ్లుగా ఏం చేశాడో చెప్పాలి.చేప పిల్లల పంపిణీలో బండి సంజయ్ పాత్ర ఎంతో చెప్పగలడా? దళిత బంధు పధకంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు.ఈటెల రాజేందర్ రైతు బంధు ఎందుకు తీసుకున్నాడని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-09-13T19:47:41+05:30 IST