ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలి: తలసాని
ABN , First Publish Date - 2021-10-02T20:36:51+05:30 IST
ప్రజలు పండగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: ప్రజలు పండగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు మరింత గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మ ప్రపంచ పండుగ గా మారడానికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు.మహిళలు బతుకమ్మను గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మంత్రి తెలిపారు.ఈ సంవత్సరం కోటి 8 లక్షల చీరల పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.