దేశంలో నే చరిత్ర సృష్టించిన పార్టీ టీఆర్ఎస్: తలసాని

ABN , First Publish Date - 2021-10-23T19:45:37+05:30 IST

దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ టీఆర్ఎస్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు.

దేశంలో నే చరిత్ర సృష్టించిన పార్టీ టీఆర్ఎస్: తలసాని

హైదరాబాద్: దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ టీఆర్ఎస్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. హై టెక్స్ లో ఈ నెల 25 వ తేదీన జరిగే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను శనివారంపరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయింది.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.పండుగ వాతావరణం లో ప్లీనరీని నిర్వహించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

Updated Date - 2021-10-23T19:45:37+05:30 IST