చరిత్రలో నిలిచిపోనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-06-03T09:50:29+05:30 IST

కొండపోచమ్మ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు.

చరిత్రలో నిలిచిపోనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌


ములుగు, జూన్‌ 2 : కొండపోచమ్మ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టును ఆయన సందర్శించి మాట్లాడారు. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే.. ముందుగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాల్సిందేనన్న ఉద్దేశంతో కేసీఆర్‌ వాటిని నిర్మించారన్నారు. దీంతో రైతులు మూడు పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్‌, సర్పంచులు భాస్కర్‌, మల్లేష్‌, భాగ్య, కొమురవెల్లి డైరెక్టర్‌ యంజాల ఐలే్‌షయాదవ్‌, సత్తయ్యయాదవ్‌, మహే్‌షయాదవ్‌, సింగన్నగూడ సర్పంచ్‌ బొల్లేపల్లి బాలకృష్ణ, ‘గడ’ అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఎంపీడీవో కౌసల్యాదేవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T09:50:29+05:30 IST