కేసీఆర్‌ను తిట్టడం తప్ప బీజేపీ నేతలకు ఏమీ చేతకాదు: తలసాని

ABN , First Publish Date - 2021-09-13T18:21:33+05:30 IST

సీఎం కేసీఆర్‌ను తిట్టడం తప్ప బీజేపీ నేతలకు ఏమీ చేతకాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

కేసీఆర్‌ను తిట్టడం తప్ప బీజేపీ నేతలకు ఏమీ చేతకాదు: తలసాని

కరీంనగర్: సీఎం కేసీఆర్‌ను తిట్టడం తప్ప బీజేపీ నేతలకు ఏమీ చేతకాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం జమ్మికుంట గండ్ల చెరువులో మంత్రి తలసాని చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీనామా చేసినందుకు చేప పిల్లలు వస్తున్నాయని ఈటెల చెబుతున్నారని... చేప పిల్లల పంపిణి కార్యక్రమం ప్రభుత్వం ఏమైనా కొత్తగా చేపట్టిందా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చారా అని నిలదీశారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి లక్ష రూపాయాల పని చేశారా అని అన్నారు. దళిత బందు తీసుకువస్తే ఎల్లిగానికి, మల్లిగానికి ఇవ్వాలని మాట్లాడున్నారని...ఎవరికి ఇవ్వాలో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. రైతు బంధు రూ.10లక్షలు వస్తే ఈటెల రాజేందర్ ఎందుకు తీసుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. 

Updated Date - 2021-09-13T18:21:33+05:30 IST