సోమువీర్రాజువి రాజకీయ డ్రామాలు: మంత్రి వెల్లంపల్లి
ABN , First Publish Date - 2021-09-06T20:15:36+05:30 IST
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ను కలిశారు. గణేష్ ఉత్సవాలపై బీజేపీ నేతల ఆందోళన అంశంపై చర్చించారు.
అమరావతి: ఏపీలో వినాయకచవితి జరుపుకోవాలని భావిస్తున్న భక్తులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ను కలిశారు. గణేష్ ఉత్సవాలపై బీజేపీ నేతల ఆందోళన అంశంపై చర్చించినట్లు సమాచారం. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో సోము వీర్రాజువి రాజకీయ డ్రామాలని విమర్శించారు. ఏపీలో వినాయకచవితి పండుగ చేసుకోకూడదని ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగలు చేసుకోవాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ పాలనపై బీజేపీ నేతలు కావాలనే మతం ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారనే విషయం సోమువీర్రాజు తెలుసుకోవాలన్నారు. వినాయక చవితి పండుగ చేసుకోవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు వినాయక చవితి జరుపుకోవాలని మంత్రి వెల్లంపల్లి సూచించారు.