ఏపీపై కేసీఆర్ వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదు: మంత్రి Vellampalli
ABN , First Publish Date - 2021-11-13T15:47:47+05:30 IST
తెలంగాణ సీఎం కేసీఆర్, వారి మంత్రి వర్గం ఏపీపై అవాకులు, చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
కర్నూలు: తెలంగాణ సీఎం కేసీఆర్, వారి మంత్రి వర్గం ఏపీపై అవాకులు, చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుకు ముణి శాపం ఉంది నిజం మాట్లాడితే తల వేయి ముక్కలవుతుందని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడుతారని, అధికారంలో లేకపోతే ఇంకోలా మాట్లాడుతారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.