పలు కుటుంబాలకు మంత్రి పరామర్శ
ABN , First Publish Date - 2020-09-22T06:52:10+05:30 IST
వేల్పూర్ మ ండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో సోమవారం మం త్రి ప్రశాంత్రెడ్డి తన బంధువులైన ముస్కు హన్మంత్రెడ్డి
వేల్పూర్/ముప్కాల్/బాల్కొండ/మెండోర: వేల్పూర్ మ ండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో సోమవారం మం త్రి ప్రశాంత్రెడ్డి తన బంధువులైన ముస్కు హన్మంత్రెడ్డి, సోదరి నీలిమా కుటుంబాన్ని పరామర్శించారు. హ న్మంత్రెడ్డి తల్లి ముస్కు మంగమ్మ ఇటీవలే మృతి చెందడం తో ఆయనను పరామర్శించారు. అలాగే ముప్కాల్ మం డలంలోని నాగంపేట్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గణేష్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా గణేష్ కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. బాల్కొండ మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నియోజకవర్గ సమ న్వయ కమిటీ సభ్యుడు తౌటు గంగాధర్ తండ్రి, ఆయన స తీమణి అనారోగ్యంతో మరణించడంతో గంగాధర్ను మంత్రి ఓదార్చారు. మెండోర మండలంలో సోన్పేట్ గ్రామంలో ఎం పీపీ బురుకల సుకన్య మామ, కమలాకర్ నాన్న ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో మంత్రి వారి కుటుంబాన్ని ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు.