కాపులకు న్యాయం చేస్తాం: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-07-31T19:28:21+05:30 IST

ఓసీలో వెనకబడి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.

కాపులకు న్యాయం చేస్తాం: మంత్రి కన్నబాబు

విజయవాడ: ఓసీలో వెనకబడి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా అడపా శేషగిరిరావు  ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.కాపు కులం కోసం నిరంతరం పాటుపడ్డ వంగవీటి రంగాని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలన్నారు. కాపు కులానికి కావలసిన విద్య, వైద్యం ఏదీ అందడం లేదన్నారు. కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టినందుకు చంద్రబాబుకి తగిన శాస్తి జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి  10% కాపులకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. ముద్రగడ్డ పద్మనాభం కుటుంబాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందన్నారు. కాపుల మీద అనేక కేసులను గత ప్రభుత్వం పెట్టిందన్నారు. వాటిని తొలగించే ప్రయత్నం జగన్మోహన్‌రెడ్డి చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. 


సంక్షేమ పథకాలు ఆపలేదు: మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ 

ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఆపలేదని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.కాపులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఆడప శేషగిరిరావు దగ్గరుండి చూసుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల్లోని కాపులందరికీ న్యాయం చేసేలా అడపా శేషగిరిరావు చూడాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2021-07-31T19:28:21+05:30 IST