పెట్రోల్ ధరలపై.. మోదీని నిలదీసే దమ్ముందా?
ABN , First Publish Date - 2021-03-08T09:40:50+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రులు విరుచుకుపడ్డారు. ఆదివారమిక్కడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో
చంద్రబాబుపై మంత్రుల దాడి
అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రులు విరుచుకుపడ్డారు. ఆదివారమిక్కడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని వేర్వేరుగా మీడియా సమావేశాలను నిర్వహించి.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీని నిలదీసే దమ్ము బాబుకు ఉందా అని కొడాలి నాని సవాల్ విసిరారు. అధికారంలో ఉండగా బాబు అవినీతికి పాల్పడ్డారని మంత్రి బొత్స విశాఖలో ఆరోపించారు.