మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి మంత్రుల సంతాపం
ABN , First Publish Date - 2020-08-04T19:42:22+05:30 IST
కమ్యూనిస్టునేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతిపట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కమ్యూనిస్టునేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతిపట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. వాపపక్షనేతగా తన సిద్దాంతాలకు కట్టుబడి ఆచరించిన ఆదర్శ నేతలగా కొనియాడారు. ఈసందర్భంగా పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు మాట్లాడుతూ సున్నం రాజయ్య నిజాయితీ, నిబద్ధత నేతగా కొనియాడారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలుచూపిన నాయకుడు. అసెంబ్లీకి ఆటోలో వచ్చిన నిరాడంబరుడని అన్నారు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్ధించారు.
కాగా దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ నిత్యం జనం మధ్యనే ఉంటూ అతి సామాన్య జీవితం గడిపిన గొప్పవ్యక్తి సున్నం రాజయ్య అన్నారు. ఆయన నిత్యం ప్రజల కోసమే ఆలోచించేవారని అన్నారు. ఆయన లాంటి నిజాయితీగల నేతలు రాజకీయాల్లోచాలా అరుదుగా ఉంటారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కొలగాలని ప్రార్ధించారు.