గవర్నర్ తల్లి మృతికి పలువురు మంత్రుల సంతాపం
ABN , First Publish Date - 2021-08-18T19:52:40+05:30 IST
రాష్ట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మృతికి పలువురు మంత్రులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
హైదరాబాద్: రాష్ట గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాతృమూర్తి కృష్ణ కుమారి మృతికి పలువురు మంత్రులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈసందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కృష్ణకుమారి పార్ధీవ దేహం పై పూల మాలలు వేసి నివాళులర్పించారు. గవర్నర్ను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాష్ట్ర పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికూడా గవర్నర్ తల్లి కృష్ణకుమారి మృతికి సంతాపం ప్రకటించారు.
ఈసందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణకుమారి ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు. గవర్నర్ తల్లి కృష్ణ కుమారి మృతికి రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణ కుమారి తమ్మకు శాంతిచేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధించారు.