మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి పట్ల పలువురు మంత్రుల సంతాపం

ABN , First Publish Date - 2021-10-30T20:17:05+05:30 IST

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి పట్ల పలువురు మంత్రుల సంతాపం

హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తెలిపిన  పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ  మరణం వార్త తెలిసి పట్ల పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్ర్బ్రాంతి వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2021-10-30T20:17:05+05:30 IST