టీకా విషయంలో ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2021-01-17T04:36:26+05:30 IST

టీకా విషయంలో ఆందోళన వద్దు

టీకా విషయంలో ఆందోళన వద్దు
తొర్రూరులో వ్యాక్సిన్‌ తీసుకుంటున్న వైద్యుడితో మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌ రావు

రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌-19 మహమ్మారిని అంతమొదించేందుకు కరోనా టీకా(కోవ్యాక్సినేషన్‌) వేస్తున్నట్లు, ఈ టీకా విషయంలో ఆందోళ వద్దని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో శనివారం కరోనా నివారణ టీకా కార్యక్రమాన్ని ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తొర్రూరు అర్బన్‌ పీహెచ్‌సీలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయా సమావేశాల్లో మంత్రులు మాట్లాడుతూ... 10 నెలలుగా కరోనాతో భయపడుతున్న ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌తో కొంత ఊరట వచ్చిందని చెప్పారు. తొర్రూరు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎంపీపీలు టీసీ అంజయ్య, రాజేశ్వరి, జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.  

 



Updated Date - 2021-01-17T04:36:26+05:30 IST