జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను కలిసిన మంత్రులు
ABN , First Publish Date - 2021-10-11T20:25:12+05:30 IST
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి తదితరులు జస్టిస్ సతీశ్ చంద్రశర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.