రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి నేడు మంత్రుల భూమిపూజ

ABN , First Publish Date - 2020-08-13T08:09:24+05:30 IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజవర్గం పరిశ్రమల హబ్‌గా మారబోతోంది. ఇప్పటికే షాబాద్‌ మండలం చందనవెళ్లిలో వెల్స్‌ఫన్‌ పరిశ్రమతోపాటు

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి నేడు మంత్రుల భూమిపూజ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజవర్గం పరిశ్రమల హబ్‌గా మారబోతోంది. ఇప్పటికే షాబాద్‌ మండలం చందనవెళ్లిలో వెల్స్‌ఫన్‌ పరిశ్రమతోపాటు మరో మూడు కంపెనీలు ఏర్పాటు కాగా.. ఇప్పుడు రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో (శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో) రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దీనికోసం 2017 అక్టోబరులో మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. టీఎ్‌సఐఐసీ ఇప్పటికే 100 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. 2022 నాటికి పనులను పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ  రైల్వే కోచ్‌ పరిశ్రమలో రైల్‌ కోచ్‌లు, బోగీలు, వ్యాగన్లు తయారు కానున్నాయి. సుమారు రూ.800 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు గురువారం మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితారెడ్డి భూమిపూజ చేయనున్నారు. 

Updated Date - 2020-08-13T08:09:24+05:30 IST