కరోనా చికిత్స పొందుతున్న.. ఎమ్యెల్యే దంపతులకు మంత్రుల పరామర్శ
ABN , First Publish Date - 2020-07-08T21:32:41+05:30 IST
కరోనా పాజిటివ్తో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్
యాదాద్రి (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్తో హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్ మహేందర్రెడ్డి దంపతులను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్రావు, ఈ టెల రాజేందర్ జగదీష్రెడ్డి మంగళవారం ఫోన్లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దంప తులు కోలుకోవాలని ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో నృసింహుడికి 101 కొబ్బరి కాయలను కొట్టారు.
సింహద్వారం ఎదుట పూజలు
ఎమ్మెల్యే దంపతులు కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగళవారం యాదాద్రి సింహాద్వారం ఎదుట టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గుట్ట మునిసిపల్ చైర్మన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, చిత్తర్ల బాలయ్యగౌడ్, కీసరి బాలరాజ్గౌడ్, అంకం నర్సింహ, తాళ్ల రాంరెడ్డి, మిట్ట అరుణ్కుమార్, గుండ్లపల్లి లింగంగౌడ్, జాని పాల్గొన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కోలుకోవాలని కోరుతూ మంగళవారం రాజాపేటలోని హనుమాన్ ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. ఆత్మకూరు(ఎం)లోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేయించారు.