నియోజకవర్గ అభివృద్ధికి ఎజెండా : మంత్రి

ABN , First Publish Date - 2021-10-15T05:27:27+05:30 IST

ఆచంట నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ఎజెండా అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి ఎజెండా : మంత్రి
ఆసరా చెక్‌ను అందజేస్తున్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

ఆచంట, అక్టోబరు 14 : ఆచంట నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ఎజెండా అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత ఆచంట మండలానికి మంజూరైన రూ. 12.19 కోట్ల చెక్కులను గురువారం వల్లూరు, ఆచంటలో జరిగిన కార్యక్రమాల్లో మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మ య్య, ఏఎంసీ చైర్మన్‌ సుంకర ఇందిరా సీతారామ్‌, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, సర్పంచ్‌లు కోట సరోజిని, నేలపూడి బేబి, సిల్లే లావణ్య, మామిడిశెట్టి కృష్ణవేణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-15T05:27:27+05:30 IST