గల్ఫ్లోని భారత ప్రవాసులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక
ABN , First Publish Date - 2021-01-16T13:12:27+05:30 IST
ల్ఫ్ దేశాల్లో కొలువులు ఇప్పిస్తామని మోసం చేసే నకిలీ ఏజెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ(ఎంఈఏ) శాఖ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో భారత రాయబార కార్యాలయం తాజాగా హెచ్చరించాయి.
గల్ఫ్లో నకిలీ ఏజెంట్ల పట్ల జాగ్రత్త
దుబాయ్, జనవరి 15: గల్ఫ్ దేశాల్లో కొలువులు ఇప్పిస్తామని మోసం చేసే నకిలీ ఏజెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ(ఎంఈఏ) శాఖ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో భారత రాయబార కార్యాలయం తాజాగా హెచ్చరించాయి. గల్ఫ్ న్యూస్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. యూఏఈలో గత నెల 12మంది భారత మహిళలు కొలువుల పేరిట మోసపోయారు. ఆ నేపథ్యంలోనే ఎంఈఏ తాజా ప్రకటన జారీ చేసింది. పనిమనుషులు అవసరమని ఏజెంట్లు చెప్పిన మాటల నమ్మి యూఏఈ వచ్చిన సదరు మహిళలు, తర్వాత తాము మోసపోయినట్లు గుర్తించారు. వారిని నిందితులు రెండు అపార్ట్మెంట్లలో బంధించారు. పోలీసులు మహిళల్ని విడిపించి, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 9 మంది భారత్కు చేరుకోగా.. మిగిలిన వారు కూడా భారత్కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు భారతీయ సంఘం ఒకటి తెలిపింది.