మినీ ట్రక్కుల కోసం.. పోటా పోటీ..!

ABN , First Publish Date - 2020-12-04T05:21:22+05:30 IST

ప్రభుత్వం రాయితీపై అందజేయనున్న మినీ ట్రక్కుల పంపిణీ విషయంలో రాజకీయ పైరవీలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణ లు విన్పిస్తున్నాయి.

మినీ ట్రక్కుల కోసం..  పోటా పోటీ..!

ఇరవై యూనిట్లకు 179 మంది దరఖాస్తు

నేడు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు..

లబ్ధిదారుల ఎంపికలో పైరవీలు..?

ఏలూరు రూరల్‌, డిసెంబరు 3 :

ప్రభుత్వం రాయితీపై అందజేయనున్న మినీ ట్రక్కుల పంపిణీ విషయంలో రాజకీయ పైరవీలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణ లు విన్పిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామని అధికారులు చెబుతున్నా నేతల సిఫార్సు కోసం దరఖాస్తుదారులు క్యూ కట్టారు. లబ్ధిదారుడి వాటా 10 శాతమే కావడం, ఆపై నెలకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం వేతనం అందజేయనుండడంతో వాహనాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉన్నవారికే వాహనాలు మంజూరు చేసేలా ప్రయత్నాలు సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఏలూరు మండలంలో మినీట్రక్కులకు తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇంటింటికి రేషన్‌ సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేషన్‌ సరఫరాకు ఇటీవల మినీట్రక్కుల కోసం మండలంలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. 28 సచి వాలయల పరిధిలో మండల వ్యాప్తంగా 20 యూనిట్లకు 179 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీనిబట్టి చూస్తే ఏ స్థాయిలో పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కాగా దరఖాస్తుదారులు ట్రక్కులను దక్కించుకునేందుకు అధికార పార్టీ నా యకులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ సరఫరా చేసేందు కు రాయితీపై మినీట్రక్కులను పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వీటిని అందజేసేందుకు చర్యలు తీసుకుంది. అర్హు లైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. ప్రతి రెండు వేల రేషన్‌కార్డులకు సరుకులు సరఫరా చేసేందుకు ఒక మినీ ట్రక్కు ను కేటాయించనుంది. ఈమేరకు మండలంలో 20 వాహనాల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించింది. 179 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరం దరికీ నేడు ఏలూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారు. మండల ప్రాంతాల్లో అధికారపార్టీకి చెందిన చోటా నాయ కులు తమకు అనుకూలంగా ఉన్నవారిని ముందుగానే నిర్ణయించి ఈ మేరకు నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల ఆశీస్సులతో తమ వారు ఎంపికయ్యేలా ముందుగానే ప్రయత్నాలు చేశారన్న వదంతులు విన్పిస్తున్నాయి. 

  రాయితీ– ఎంపికలు ఇలా..

ప్రభుత్వం రాయితీపై మినీట్రక్కులతో పాటు, వాహన డ్రైవర్‌కు ప్రతినెలా రూ.10 వేలు చొప్పున వేతనం అందజేయనుంది. ఒక్కో వాహనం విలువ 5,81,190 ఉండగా, లబ్దిదారులు కేవలం పది శాతం మాత్రమే చెల్లించాలి, బ్యాంకు రుణం 30 శాతం, ప్రభుత్వ సబ్సిడీ 60 శాతం అందిస్తుంది. బ్యాంకు అందించిన రుణాన్ని 72 నెలల వాయిదాల్లో వడ్డీతో సహా చెల్లించాలి. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పౌరసరఫరాలశాఖ, వివిధ కార్పొరేషన్లకు అప్పగించింది. ఇంట ర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులను ఖరారు చేస్తారు. వారికి వాహనాలు అందజేస్తారు. 


 అర్హులకే ప్రాధాన్యం : ఎంపీడీవో మనోజ్‌ 

 ట్రక్కులకు సంబంధించి మండలంలో 179 దరఖాస్తులు వచ్చాయి. అన్ని అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేస్తాం. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తా రు. ఎటువంటి సిఫార్సులకు తావులేదు. నిష్పాక్షపాతంగా ఎంపికలు జరుగుతాయి.

Updated Date - 2020-12-04T05:21:22+05:30 IST