మైనర్‌పై స్వీపర్‌ అత్యాచారం

ABN , First Publish Date - 2021-05-11T15:00:06+05:30 IST

వత్సవాయి బాలుర గురుకుల..

మైనర్‌పై స్వీపర్‌ అత్యాచారం

వత్సవాయి: వత్సవాయి బాలుర గురుకుల పాఠశాల వద్ద ఆడుకుంటున్న బాలికపై పాఠశాలలో స్వీపర్‌ ఏసుపోగు అప్పారావు (46) సోమవారం అత్యాచారానికి పాల్పడినట్టు జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. గురుకుల పాఠశాలలోకి ఆ బాలిక వేరే బాలికతో కలిసి ఆడుకోవటానికి రాగా స్వీపర్‌, క్లీనర్‌గా పనిచేస్తున్న అప్పారావు మాయమాటలు చెప్పి బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు. వత్సవాయి ఎస్సై మహాలక్ష్ముడు ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, దిశ సీఐ నరే్‌షను, క్లూస్‌ టీమ్‌ను వత్సవాయి పంపారు. నిందితుడిని పట్టుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 


తొలిసారిగా దిశా వాహనంలో విచారణ

జగ్గయ్యపేట : అత్యాచార ఘటనలో విచారించేందుకు జిల్లాలో తొలి సారిగా దిశా వాహనాన్ని వినియోగించారు. ఎస్పీ ఆదేశాలతో దిశ వాహనంలో బాధితురాలితో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సాక్ష్యాలను భద్రపరచేలా వాహనంలో ఏర్పాట్లున్నాయి. కంప్యూటర్‌ ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. సీఐ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ నిందితుడు అప్పారావుపై 354, 376 (3) రెడ్‌ విత్‌ 511, సెక్షన్‌ 9(ఎం)రెడ్‌విత్‌ 10 పోస్కో 2012 కింద కేసు నమోదు చేశామని, ఫిర్యాదు వచ్చి న గంటల్లోనే తొలిసారిగా దిశవాహనంలో విచారిస్తున్నట్టు తెలిపారు.


Updated Date - 2021-05-11T15:00:06+05:30 IST