కదిలే బస్సులో మైనర్ బాలికపై ముగ్గురి అత్యాచారం

ABN , First Publish Date - 2021-07-01T14:01:55+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.కదిలే లగ్జరీ బస్సులో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన...

కదిలే బస్సులో మైనర్ బాలికపై ముగ్గురి అత్యాచారం

సుల్తాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం వెలుగుచూసింది.కదిలే లగ్జరీ బస్సులో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన సుల్తాన్ పూర్ జిల్లాలో జరిగింది. వాహనాల తనిఖీల్లో భాగంగా సుల్తాన్ పూర్ లో ఓ లగ్జరీ బస్సు ఆపి పోలీసులు తనిఖీ చేయగా అందులో ఇద్దరు బాలికలున్నారు. తాము ఇంటరాగేట్ చేయగా బస్సులో ఉన్న డ్రైవరుతోపాటు మరో ఇద్దరు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశారని తేలిందని సర్కిల్ పోలీసు అధికారి బాల్ దిరాయ్ రాజారాం చౌదరి చెప్పారు. బాలికకు వైద్యపరీక్షలు జరిపి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. బస్సును సీజ్ చేసి అత్యాచారం కేసులో నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-07-01T14:01:55+05:30 IST