స్నేహితురాలి ప్రియుడితో తరచూ ఫోన్లో కబుర్లు.. ఆమెను కాదు నిన్నే ప్రేమిస్తున్నానంటూ కుర్రాడి రివర్స్ గేర్.. బైక్‌పై తీసుకెళ్లి..

ABN , First Publish Date - 2021-11-01T20:58:32+05:30 IST

ఆమెకు ఇప్పుడు సుమారు 16 ఏళ్లు. స్థానికంగా ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి స్నేహితురాలితో కలిసి తరచూ బయటికెళ్లేంది. ఈ క్రమంలోనే స్నేహితురాలి ప్రియుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం వరకూ వెళ్లింది. దీంతో ఆ యువకుడు తరచూ ఈ అమ్మాయికి ఫోన్ చేసేవాడు. ఈ 16ఏళ్ల అమ్మాయి కూడా అత

స్నేహితురాలి ప్రియుడితో తరచూ ఫోన్లో కబుర్లు.. ఆమెను కాదు నిన్నే ప్రేమిస్తున్నానంటూ కుర్రాడి రివర్స్ గేర్.. బైక్‌పై తీసుకెళ్లి..

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు ఇప్పుడు సుమారు 16 ఏళ్లు. స్థానికంగా ఉన్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి స్నేహితురాలితో కలిసి తరచూ బయటికెళ్లేంది. ఈ క్రమంలోనే స్నేహితురాలి ప్రియుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవడం వరకూ వెళ్లింది. దీంతో ఆ యువకుడు తరచూ ఈ అమ్మాయికి ఫోన్ చేసేవాడు. ఈ 16ఏళ్ల అమ్మాయి కూడా అతడితో గంటల తరబడి కబుర్లు చెప్పేంది. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ఓ రోజు అతడు ఆమెకు షాకింగ్ విషయం చెప్పాడు. ‘నువ్వంటే నాకు ఇష్టం. నీ ఫ్రెండ్‌ను నేను ప్రేమించడం లేదు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా’ అని చెప్పడంతో ఆ అమ్మాయి కంగుతింది. అంతేకాకుండా ఈ విషయం మాట్లాడేందుకు ఓ చోట కలుద్దాం అని సూచించాడు. దీంతో ఆ అమ్మాయి అక్కడు వెళ్లి, ఆటోలో కూర్చుంది. తర్వాత అక్కడకు చేరుకున్న యువకుడు.. ఆ అమ్మాయిని బైక్‌పై తీసుకెళ్లాడు. అనంతరం ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తన క్లాస్‌మేట్ అయిన మరో అమ్మాయి.. రింకూ అనేః యువకుడితో ప్రేమలో పడింది. దీంతో ఆ అమ్మాయి.. రింకూను కలిసేందుకు ఈ 16ఏళ్ల అమ్మాయిని వెంటబెట్టకుని వెళ్లేంది. ఈ క్రమంలోనే రింకూకీ, ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడింది. ఓ రోజు అతడు ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఈ 16ఏళ్ల అమ్మాయి కూడా ఫోన్‌లో అతడికి కబుర్లు చెప్పింది. తాజాగా ఓ రోజు రింకూ బాంబు పేల్చాడు. ‘నీ ఫ్రెండ్‌ను నేను ప్రేమించడం లేదు. నువ్వంటేనే నాకు ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా’ అని చెప్పేసరికి 16ఏళ్ల అమ్మాయి షాకైంది.


అంతేకాకుండా ఈ విషయపై మాట్లాడేందుకు ఓ చోట కలుద్దాం అని రింకూ చెప్పడంతో అక్టోబర్ 30న వెళ్లింది. ఆటోలో కూర్చుని ఉన్న ఈ అమ్మాయిని రింకూ బైక్‌పై ఎక్కించుకుని.. మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పెళ్లి విషయం మాట్లాడుతూనే.. దారుణానికి పాల్పడ్డాడు. అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఘోరం జరిగిన తర్వాత ఇంటికి చేరుకున్న ఆ అమ్మాయి.. జరిగిన విషయాన్ని అక్టోబర్ 31న తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆ బాధితురాలి తల్లిదండ్రులు నవంబర్ 1 రింకూపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-11-01T20:58:32+05:30 IST