మైనార్టీల ద్రోహి సీఎం జగన్
ABN , First Publish Date - 2022-01-27T04:41:34+05:30 IST
మైనార్టీల సంక్షేమం, అ భివృద్ధి రెండింటినీ గాలికొదిలేసి మైనార్టీలకు ఇచ్చిన హ మీలను తుంగలో తొక్కి సీఎం జగన్ మైనార్టీల ద్రోహిగా తయారయ్యారని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాఖ్ అహ్మద్ అన్నారు.
టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాఖ్ అహ్మద్
ప్రొద్దుటూరు క్రైం, జనవరి 26: మైనార్టీల సంక్షేమం, అ భివృద్ధి రెండింటినీ గాలికొదిలేసి మైనార్టీలకు ఇచ్చిన హ మీలను తుంగలో తొక్కి సీఎం జగన్ మైనార్టీల ద్రోహిగా తయారయ్యారని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాఖ్ అహ్మద్ అన్నారు. ప్రొద్దుటూరు వచ్చిన ఆయన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్ ముక్తియా ర్ నివాసంలో జరిగిన మైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలన లో ఆరాచకం, గుండాయిజం, దౌర్జన్యం ఎక్కువైందని ఆరోపించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా కేసులు పెట్టడం, జైలుకు పంపడం అనవాయితీగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలను జగన్ కాలగర్భంలో కలి పారని ఆరోపించారు. వీఎస్ ముక్తియార్ మాట్లాడుతూ వలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, టీడీపీకి ఓటేస్తే, సంక్షేమ పథకాలు పోతాయని వైసీసీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ప్రవీణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తనను ఆదరించి గెలిపించాలని, మీ బిడ్డగా మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్, అడ్వకేట్ దాదాపీర్, ఇనాయతుల్లా, ముర్తూజాహుస్సేన్, షేర్ అలీ, ఫిట్టర్ రఫీ పాల్గొన్నారు.