మిర్చి రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలి
ABN , First Publish Date - 2020-12-04T05:56:26+05:30 IST
మిర్చి సీజన్ ప్రారంభమైన దృష్ట్యా యార్డులో సకల సౌకర్యాలు రైతులకు కల్పించాలని చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆదేశించారు.
గుంటూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మిర్చి సీజన్ ప్రారంభమైన దృష్ట్యా యార్డులో సకల సౌకర్యాలు రైతులకు కల్పించాలని చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆదేశించారు. గురువారం మిర్చియార్డు పరిపాలన భవనంలో జరిగిన పాలకవర్గం సమావేశంలో ఆయన ప్రసంగించారు. రైతులకు సాధ్యమైనంత త్వరగా మధ్యాహ్న భోజనం సౌకర్యం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ-నామ్లో త్వరితగతిన మిర్చి లావాదేవీలు జరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో వైస్చైర్మన్ శృంగవరపు శ్రీనివాసరావు, సభ్యులు, సెక్రటరి ఎం వెంకటేశ్వరరెడ్డి, యూడీసీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.