28,960 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2021-12-07T06:14:14+05:30 IST
మిర్చియార్డుకు సోమవారం 29,000టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 28,960 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు సోమవారం 29,000టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 28,960 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 8,032 టిక్కీలు నిల్వవున్నాయి. సోమవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.15,500, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ. 17,500, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,000, ఏసీ కామన్ వెరైటీకి రూ.7,000, రూ.15,000, ఏసీ స్పెషల్ వెరైటీకి రూ.9,000, రూ. 17,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,500 ధర లభించినట్లు యార్డు సెక్రెటరీ ఐ. వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.