1,13,487 మిర్చి టిక్కీల విక్రయం
ABN , First Publish Date - 2022-01-29T05:43:06+05:30 IST
మిర్చియార్డుకు శుక్రవారం 97,094 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 1,13,487 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.
గుంటూరు, జనవరి28(ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం 97,094 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 1,13,487 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 49,390 టిక్కీలు నిల్వ ఉన్నాయి. శుక్రవారం యార్డులో నాన్ ఏసీ కామన్ వెరైటీలు క్వింటాల్కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.18,000, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలకు రూ.7,000, రూ.18,500, నాన్ ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.9,500, ఏసీ కామన్ వెరైటీకి రూ.9,200, రూ.17,000, ఏసీ స్పెషల్ వెరైటీకి రూ.7,800, రూ.18,000, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.6,000 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.