ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి మృతి

ABN , First Publish Date - 2021-06-09T19:32:16+05:30 IST

ఆసుపత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మరణించారు.....

ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి మృతి

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): ఆసుపత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి వైద్యులు తనపై అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించారు. మే 29వతేదీన తాను పేగు సమస్యతో ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేరితే శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్  కు తీసుకువెళ్లి తనపై వైద్యులు అత్యాచారం చేశారని బాధితురాలు తన సోదరుడికి ఫిర్యాదు చేశారు. వైద్యులు మంచివారు కాదని, తప్పు చేశారని, తనకు చికిత్స కూడా చేయలేదని బాధితురాలు కాగితంపై రాశారు. దీంతో స్థానిక పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. 


అనంతరం బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని చెప్పి వెళ్లాక యువతి మరణించింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. యువతికి ఆపరేషన్ చేసిన సమయంలో ఇద్దరు మగ వైద్యులున్నారని, నలుగురు మహిళా సర్జన్లు, నర్సు ఉన్నారని అత్యాచారం జరిగిందనే విషయాన్ని ఎస్పీ సింగ్ కొట్టిపారేశారు. యువతి మానసిక స్థితి బాగాలేకనే వైద్యులపై ఆరోపణలు చేసిందని పోలీసులంటున్నారు. 

Updated Date - 2021-06-09T19:32:16+05:30 IST