తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

ABN , First Publish Date - 2020-10-30T03:16:22+05:30 IST

తెలంగాణలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 మంది అదృశ్యమయ్యారని...

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 4 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 మంది అదృశ్యమయ్యారని పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. నిన్న ఒక్క రోజే 65 మంది అదృశ్యమైనట్లు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు నమోదు చేశారు. ఈ నెల 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62 కేసులు, 28న 65 కేసులు, ఈ రోజు 11 మంది మిస్సింగ్‌ అయినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. దీంతో ఈ మిస్సింగ్‌ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. 

Updated Date - 2020-10-30T03:16:22+05:30 IST