తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

ABN , First Publish Date - 2020-10-30T02:23:09+05:30 IST

తెలంగాణలో రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. 4 రోజుల్లో తెలంగాణలో 203 మంది అదృశ్యమయ్యారు. పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో మిస్సింగ్ కేసుల

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. 4 రోజుల్లో తెలంగాణలో 203 మంది అదృశ్యమయ్యారు. పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో మిస్సింగ్ కేసుల వివరాలు పొందుపర్చారు. బుధవారం ఒక్క రోజే 65 మంది అదృశ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, సైబరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 8 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 26న 65 మిస్సింగ్‌ కేసులు, 27న 62 కేసులు, 28న 65 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 11 మిస్సింగ్‌ కేసులు నమోదు అయినట్లు పోలీసులు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. మిస్సింగ్‌ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.

Updated Date - 2020-10-30T02:23:09+05:30 IST