చాలా రోజులుగా కనపడని యువకుడు.. అతనికోసం తముళ్ల గాలింపు.. చివరికి అతని కూతరు నిజం చెప్పడంతో.. అందరూ షాక్!

ABN , First Publish Date - 2021-11-26T14:32:27+05:30 IST

తమ అన్న కొద్ది రోజులుగా కనపడడం లేదని ఆ ఇద్దరు తమ్ముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వారితో కలిసి ఎంత వెతికినా లాభం లేకపోయింది. అనుకోకుండా కనపడకుండా పోయిన వ్యక్తి కూతురు నాన్న ఎక్కడున్నాడో తనకు తెలుసునని...

చాలా రోజులుగా కనపడని యువకుడు.. అతనికోసం తముళ్ల గాలింపు.. చివరికి అతని కూతరు నిజం చెప్పడంతో.. అందరూ షాక్!

తమ అన్న కొద్ది రోజులుగా కనపడడం లేదని ఆ ఇద్దరు తమ్ముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వారితో కలిసి ఎంత వెతికినా లాభం లేకపోయింది. అనుకోకుండా కనపడకుండా పోయిన వ్యక్తి కూతురు నాన్న ఎక్కడున్నాడో తనకు తెలుసునని చెప్పింది. అది విన్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్‌పూర్ జిల్లాలో జరిగింది.


ఫతేహ్‌పూర్ జిల్లాలో నివసించే సిక్కూ(35) అనే వ్యక్తి చాలా రోజులుగా కనబడడం లేదంటూ అతని సోదరులు సుదామా, దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిక్కూ గురించి అతని భార్యపై అనుమానంగా ఉందని వారు చెప్పారు. పోలీసుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. సిక్కూ భార్య ఉమని, అతని కూతుర్లని ప్రశ్నించారు.


అప్పుడు అతని చిన్న కూతురు నాన్నకు ఏమైందో తనకు తెలుసునని బాబాయ్ దిలీప్‌తో చెప్పింది. 'కొన్ని రోజుల క్రితం ఇంటికి ఒక అంకుల్ వచ్చాడని అతను, అమ్మ(సిక్కు భార్య ఉమ) కలిసి నాన్నని కొట్టి పడేసి ఇంట్లో ఉన్న స్టోర్ రూంలో దాచిపెట్టారు' అని చెప్పింది. దీంతో పోలీసులు స్టోర్ రూంలో వెతికారు కానీ సిక్కు కనపడలేదు.




మరుసటి రోజు అదే ఊర్లోని ఒక బావిలో నుంచి దుర్వాసన వస్తోందని కొందరు చెప్పగా.. అనుమానంతో సిక్కూ తమ్ముళ్లు అక్కడ వెతకగా.. అందులో ఒక శవం కనపడింది. పోలీసులు ఎంతో కష్టపడి ఆ శవాన్ని బయటికి తీశారు. అది సిక్కూ మృతదేహమని అతని తమ్ముళ్లు గుర్తించారు. దీంతో పోలీసులు సిక్కూ భార్యని తమ పద్ధతిలో ప్రశ్నించారు. అప్పుడు ఆమె తాను తన ప్రియుడు రాజ్ కుమార్‌తో కలిసి తన భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది.


పోలీసులు సిక్కు హత్య కేసులో అతని భార్య ఉమని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-11-26T14:32:27+05:30 IST