ఎక్కడున్నావు.. పాపా!

ABN , First Publish Date - 2021-10-25T05:05:09+05:30 IST

ఎక్కడున్నావు తల్లీ.. ఎప్పుడు కనపడతావమ్మా?.. నీవు లేకపోతే మేం ఎలా బతకాలమ్మా?.. అంటూ ఏడాది కిందట పుట్టినరోజు నాడే అదృశ్యమైన కుమార్తె కోసం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు

ఎక్కడున్నావు.. పాపా!
శ్రీలక్ష్మి

కన్నబిడ్డ కనిపించక.. ఏడాది

ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 

పెదకూరపాడు, అక్టోబరు 24: ఎక్కడున్నావు తల్లీ.. ఎప్పుడు కనపడతావమ్మా?.. నీవు లేకపోతే మేం ఎలా బతకాలమ్మా?.. అంటూ ఏడాది కిందట పుట్టినరోజు నాడే అదృశ్యమైన కుమార్తె కోసం ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఏరోజుకారోజు కుమార్తె ఆచూకీ దొరుకుతుందేమో అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీలక్ష్మి, రమేష్‌ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారి రెండవ కుమార్తె కీర్తి గత ఏడాది అక్టోబరు 26వ తేదీన వారి ఇంటి సమీపంలోని  ఆడుకుంటూ అదృశ్యమైంది. అప్పటికి ఆ చిన్నారికి నాలుగేళ్లు. అప్పటి నుంచి తల్లిదండ్రులు పాప ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ ఫలితం లేదు. పోలీసు  కేసు నమోదైనా దానిని ఛేదించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 26వ తేదీన కీర్తి పుట్టినరోజు. ఆ పాప కేసును ప్రత్యేక బృందాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తల్లిదండ్రుల కడుపు కోత తీర్చాలని స్థానికుల కోరుతున్నారు. చిన్నారి అదృశ్యంపై తుళ్లూరు డీఎస్పీ వి.పోతురాజును వివరణ కోరగా టెక్నికల్‌ టీం, ఫీల్డు టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. 

 

Updated Date - 2021-10-25T05:05:09+05:30 IST