ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
ABN , First Publish Date - 2021-10-17T05:50:22+05:30 IST
ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై శ్రీకాళహస్తి వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 16: ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై శ్రీకాళహస్తి వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య కథనం మేరకు... పట్టణ ముత్యాలమ్మ గుడివీధికి చెందిన బాలు(15), పవన్(15) స్నేహితులు. వీరిద్దరూ స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం సెలవు కావడంలో ఇద్దరు విద్యార్థులు ఉదయమే ఇంటి నుంచి బయటికి వెళ్లారు. అయితే రాత్రయినా రాక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీప బంధువులు, స్నేహితులతో ఆరాతీసినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు శనివారం వన్టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బాలు, పవన్ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.