వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-01-16T04:53:57+05:30 IST
అనుమానాస్పదంగా యువకుడి మృతికి సంబంధించిన కేసు ఒకటవ పట్టణ స్టేషన్లో నమోదయింది.
ఖమ్మం క్రైం, జనవరి 15: అనుమానాస్పదంగా యువకుడి మృతికి సంబంధించిన కేసు ఒకటవ పట్టణ స్టేషన్లో నమోదయింది. పోలీసుల కఽథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మైలవరం మండలం పొందుగుల గ్రామానికి చెందిన మర్ల రాంబాబు (25) అనే యువకుడు ఖమ్మంలో ఉంటున్నాడు. నగరంలోని ఒక పం డ్ల వ్యాపారి వద్ద వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్లో మద్యం సేవించాడు. కాగా గురువారం తెల్లవారుఝామున షాదీఖానా వద్ద గాయాలతో మృతి చెంది కనిపించాడు.. దీనిపై రాంబాబు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు రాంబాబు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ గురువారం ఒకటవ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.