మహిళల ఐపీఎల్పై ఆలస్యం చేయొద్దు: మిథాలీ
ABN , First Publish Date - 2020-03-27T13:09:13+05:30 IST
మహిళల ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐ ఇక ఆలస్యం చేయకూడదని
న్యూఢిల్లీ : మహిళల ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐ ఇక ఆలస్యం చేయకూడదని వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్ అంటోంది. పరిమిత స్థాయిలో లీగ్ను నిర్వహించేందుకు వచ్చే ఏడాది నుంచే సన్నాహకాలు ప్రారంభించాలని కోరింది. ఆ తర్వాత నెమ్మదిగా అభివృద్ధి చేయాలని సూచించింది. ‘కొన్ని నిబంధనలను సడలించాలి. తొలి అంచెలో ఐదు లేదా ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఆడే విధంగా అవకాశం కల్పించాల’ని రాజ్ చెప్పింది.