అస్సాం సీఎంపై అన్ని కేసులూ తొలగించండి: మిజోరం సీఎం

ABN , First Publish Date - 2021-08-03T11:07:20+05:30 IST

సరిహద్దు వివాదం నేపథ్యంలో అస్సాం సీఎంపై నమోదు చేసిన అన్ని కేసులనూ తొలగించాలని మిజోరం సీఎం జోరంథాంగా సోమవారం..

అస్సాం సీఎంపై అన్ని కేసులూ తొలగించండి: మిజోరం సీఎం

ఐజ్వాల్: సరిహద్దు వివాదం నేపథ్యంలో అస్సాం సీఎంపై నమోదు చేసిన అన్ని కేసులనూ తొలగించాలని మిజోరం సీఎం జోరంథాంగా సోమవారం రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య జూలై 26న హింసాత్మక ఘటలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మారణకాండలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేకమంది పోలీసులు మరణించారు. దీంతో అస్సాం సీఎంపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేస్తూ మిజోరంలోని వైరెంగ్టే, కోలాసిబ్ జిల్లాల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటనీ తొలగించాలని మిజోరం సీఎం జోరంగ్‌థాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.


దీనికి సంబంధించి జోరాంగ్‌థాన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు సానూకూల పరిష్కారం కోసం తాను ప్రయత్నిస్తున్నానని, అలాగే ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా వివాదం సర్దుమణిగేందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-08-03T11:07:20+05:30 IST